దహెగాం, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో నాటుసారా నిషేధించాలని నిర్ణయించారు. గుడుంబా నిషేధిస్తామని శనివారం గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేశారు. గుడుంబాను నిర్మూలిద్దామంటూ నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. నాటుసారాను అరికట్టాలని తహసీల్దార్మునావర్షరీఫ్కు, ఏఎస్సై రమేశ్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువకులు, వృద్ధులు అని తేడా లేకుండా గుడుంబాకు బానిసై చెడు మార్గంలో నడుస్తున్నారని, తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా గుడుంబా తాగినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
