ఈడీ ఆఫీస్ లో ముగిసిన పూరి, ఛార్మిల విచారణ

ఈడీ ఆఫీస్ లో ముగిసిన  పూరి, ఛార్మిల విచారణ

డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిల ఈడీ విచారణ ముగిసింది. లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై అధికారులు వీరిని ప్రశ్నించారు. ఉదయం ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చిన వీరిద్దరూ ఈడీ ముందు హాజరయ్యారు. దాదాపు 12 గంటలపాటు పూరి, ఛార్మిని ఈడీ ప్రశ్నించింది. లైగర్ పెట్టుబడుల వెనుక ఎవరున్నారనే దానిపై అధికారులు ఆరా తీశారు.

లైగర్ సినిమా నిర్మాణానికి పలు సంస్థల నుంచి డబ్బులు వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విదేశీ అకౌంట్స్ నుంచి వీరి ఇద్దరి ఖాతాల్లోకి ట్రాన్సక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. 20 రోజుల క్రితమే పూరి జగన్నాథ్, ఛార్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన వీరిద్దరిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.