దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదలైంది.
సంగీతం, ధ్వని, మానవ మెదడు, జ్ఞాపకాలు, గిల్ట్ వంటి అంశాలతో మిస్టికల్ మ్యూజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కింది. టీజర్లోని ఆసక్తికరమైన సంభాషణలు, విభిన్నమైన పాత్రలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హర్ష హీరోగా, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి హీరో హీరోయిన్స్గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా కీలక పాత్రల్లో నటించారు. మదన్ కథను అందించగా, నిర్మాత, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను చంద్ర సిద్ధార్థ్ నిర్వహించారు.
