రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి ట్రైలర్ రిలీజ్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి

రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి ట్రైలర్ రిలీజ్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి

రాగ్ మయూర్ హీరోగా ‘డిజే టిల్లు’  ఫేమ్  విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అనుమాన పక్షి’.  మెరీన్ హీరోయిన్‌‌గా నటించగా, రాశి, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్ కీలకపాత్రలు పోషించారు.  రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను  హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేసి టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ పాత్రలో రాగ్ మయూర్ కనిపించాడు.  కశ్మీర్‌‌లో ఓ అమ్మాయితో ప్రేమలో పడిన అతడిని ఓ పోలీస్ అధికారి ఎందుకు వెంటాడుతున్నాడనేది కథలో ఆసక్తికర అంశంగా ట్రైలర్‌‌‌‌లో చూపించారు.  రాగ్ మయూర్ కామిక్ టైమింగ్, మెరిన్ ఫిలిప్‌‌తో కెమిస్ట్రీ   హైలైట్‌‌గా నిలిచాయి.  శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 18న  సినిమా విడుదల  కానుంది.