గంగాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి

గంగాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి

కడెం, వెలుగు: గ్రామాల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం కడెం మండలంలోని గంగాపూర్ గ్రామంలో పర్యటించి బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి పేదవాడిని అన్ని రకాలుగా ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలకు దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడెం ఎంపీపీ అలెగ్జాండర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, జిల్లా యువజన అధ్యక్షుడు సతీశ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ వర్మ, గొల్ల వెంకటేశ్, సమీప గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.