బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి ఎలిమినేషన్.. ఈ ఇద్దరిలో ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి ఎలిమినేషన్.. ఈ ఇద్దరిలో ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో మొదటి ఎలిమినేషన్ కు సమయం ఆసన్నం అయింది. మొదటి వరం మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. అందులో కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, థామినీ, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ అండ్ రతిక ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం పల్లవి ప్రశాంత్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆతరువాతి స్థానంలో రతిక, శోభా శెట్టి,గౌతమ్ కృష్ణ, షకీలా దామిని ఉన్నారు. 

ఓటింగ్ లీస్ట్ లో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్ ఉన్నారు. ఎనిమిది మందిలో ఈ ఇద్దరికీ చాలా తక్కువ వోటింగ్ వస్తోంది. దానికి ముఖ్య కారణం ఈ ఇద్దరికి తెలుగు భాష రాకపోవడమే. ఈ కారణం వల్ల ఈ ఇద్దరు మిగతా వారితో పెద్దగా కలవడంలేదు. పెద్దగా బయటకు కనిపించడంలేదు కూడా. ప్రేక్షకులు కూడా ఈ ఇద్దరికీ పెద్దగా కనెక్ట్ కావడంలేదు. కాబట్టి కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్ లో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ కానున్నారు.