రాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయ్: వివేక్ వెంకట స్వామి

రాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజులు దగ్గర పడ్డాయ్: వివేక్ వెంకట స్వామి

రాష్ట్రంలో బీర్ఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టడానికి రోజుల దగ్గరపడ్డాయని చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కుటుంబ పాలన కొనసాగుతుందని.. దానివల్ల ప్రజలంతా ఎన్నో కష్టాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రజలను మోసం చేశాడని అన్నారు. చెన్నూరులో బాల్కసుమన్ ఇసుక దందాతో కోట్లు సంపాదించుకున్నాడని వివేక్ వెంకట స్వామి తెలిపారు. 

చెన్నూరులో వివేక్ వెంకట స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీల కార్డుపై మొదట సంతకం చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ తోనే చెన్నూరు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 

ఎన్నికల ముందు ప్రజలు ఆగం కావొద్దని.. అన్నీ పార్టీల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని వివేక్ వెంకట స్వామి కోరారు.