ఓటర్​లిస్ట్​ను మరోసారి చెక్​ చేసుకోండి: ఎన్నికల చీఫ్​ వికాస్​రాజ్

ఓటర్​లిస్ట్​ను మరోసారి చెక్​ చేసుకోండి: ఎన్నికల చీఫ్​ వికాస్​రాజ్

నిజామాబాద్, వెలుగు: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్​లిస్టును మరోసారి చెక్​చేయాలని రాష్ట్ర ఎన్నికల చీఫ్​ వికాస్​రాజ్​సూచించారు. అర్హులెవరూ నష్టపోకుండా జాబితా సిద్ధం చేయాలన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్​లతో వీసీలో మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో ఓట్లు తగ్గిన బూత్​లను విజిట్​చేసి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ నెల 23 నాటికి ఓటరు మార్పు, చేర్పుల సర్వే పూర్తిచేయాలన్నారు. గతంలో తక్కువ పోలింగ్​శాతం నమోదైన ప్రాంతాలను గుర్తించి, ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.

పోలీస్ స్టేషన్​ప్రతీ చోటా గ్రౌండ్​ఫ్లోర్​లోనే ఉండాలని వికాస్​రాజ్​ సూచించారు. ర్యాంప్​లు ఏర్పాటు చేయాలన్నారు. సోషల్​మీడియా పోస్టులను గమనించాలని, వదంతులు వ్యాప్తి చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇన్​చార్జి కమిషనర్ ​ప్రవీణ్​కుమార్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ కలెక్టర్​ కిరణ్మయి, సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఆర్డీవోలు రాజేశ్వర్, రవి పాల్గొన్నారు.