
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్య సభ సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యం కావడం గమనార్హం. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
*12 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల
* నామినేషన్ల దాఖలుకు ఈనెల 21 చివరి తేదీ
* నామినేషన్ల ఉపసంహరణకు అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు ఈనెల 26 చివరి తేదీ
* నామినేషన్ల ఉపసంహరణకు బీహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఈనెల 27 చివరి తేదీ.
* సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్
* అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు