పార్లమెంటు ఎన్నికలు ... ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ రిలీజ్

పార్లమెంటు ఎన్నికలు ...  ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్  రిలీజ్

పార్లమెంటు ఎన్నికల ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో గెజిట్ రిలీజ్ అయింది. దీంతో నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది.  మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాల్లో  పోలింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్  19న పోలింగ్  జరగనుంది. జూన్  4న ఫలితాలు రానున్నాయి.  

తమిళనాడులోని 39, రాజస్థాన్ లోని 12, ఉత్తర్ ప్రదేశ్ లోని 8, మధ్యప్రదేశ్ లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ , అస్సాంలలోని ఐదేసి, బిహార్ లోని 4 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ లోని 3, అరుణాచల్  ప్రదేశ్ , మణిపుర్ , మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్ గఢ్ , మిజోరం, నాగాలాండ్ , సిక్కిం, త్రిపుర, అండమాన్  నికోబార్ , జమ్మూ కశ్మీర్ , లక్షద్వీప్ , పుదుచ్చేరిల్లో ఒక్కో పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ జరగనుంది.