మోడీ డైరెక్షన్‭లోనే బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు: కేఏ పాల్

మోడీ డైరెక్షన్‭లోనే బీఆర్ఎస్ పార్టీ పెడుతున్నారు: కేఏ పాల్

మునుగోడు ఉపఎన్నికలో ఎలక్షన్ ఆఫీసర్లు టీఆర్ఎస్ ఏజెంట్లుగా పనిచేశారని కేఏ పాల్ ఆరోపించారు. ప్రచార సమయంలో టీఆర్ఎస్ నాయకులు తనను అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. ఉపఎన్నికలో తాను ఓడిపోవడానికి ఎలక్షన్ ఆఫీసర్లే కారణమని ఫైర్ అయ్యారు. ఈవీఎంలను మార్చడం వల్లనే తాను ఓడిపోయానని అన్నారు.  ఓడిపోయినా మునుగోడులోనే ఉంటానని పాల్ చెప్పారు. 

టీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్.. బీజేపీకి బీ పార్టీగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ డైరెక్షన్‭లో బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి కాంగ్రెస్‭ను దేశంలో లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ విషయం పై తాను కేసీఆర్‭ని ఎందుకు ప్రశ్నించడం లేదని.. సీబీఐ డైరెక్టర్, అమిత్ షాని ప్రశ్నించానని చెప్పారు. వాళ్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కేఏ పాల్ మండిపడ్డారు. దేశంలో బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఉండకూడదని మోడీ కుట్ర చేస్తున్నారన్నారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని పేర్కొన్నారు. బీజేపీ కంటే బలమైన శివసేన పార్టీని కూడా మహారాష్ట్రలో చిత్తుగా ఓడించారని అన్నారు.