V6 News

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

 అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించరాదని, ఎన్నికలను పాదర్శకంగా నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకంగా ఉంటుందని ఎన్నికల అబ్జర్వర్​ రవి కిరణ్, జిల్లా ఎలక్షన్​ అధికారి, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు.

 మంగళవారం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పైన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు, తహసీల్దార్లతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్​నితిన్, ఎంసీసీ నోడల్​ ఆఫీసర్​విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.