హైదరాబాద్, వెలుగు: సిటీలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు, పాంప్లెంట్లు అందజేశారు. ‘ప్రౌడ్ టు ఓట్’ అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఎల్వో, సూపర్వైజర్లు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారిక నివాసానికి వెళ్లారు.
అక్కడ స్టిక్కర్ను అతికించారు. పాంప్లెంట్, ఓటర్స్ స్లిప్లను కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి ఇంటికి వెళ్లి ఓటు హక్కుపై అవగాహన కల్పించి స్లిప్పులను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తిచేయాలని సూచించారు.