ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు కుంభకోణం, కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో ఆ పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదేనా అని ప్రశ్నించారు. శనివారం ముషీరాబాద్ అడిక్మెట్ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ సీనియర్ నాయకుడు సాయికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్అందజేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తమ పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, నాయకులు రమేశ్రామ్, కౌండిన్య ప్రసాద్, వెంకటేశ్, శేషసాయి తదితరులు పాల్గొన్నారు.
