ప్రగతినగర్ లో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

ప్రగతినగర్ లో ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

జీడిమెట్ల, వెలుగు: ప్రగతినగర్ లో ​కార్పొరేషన్​ పరిధిలోని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ విభాగం ఏఈ ఎ.జ్ఞానేశ్వర్​లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్​లోని ఓ ఇంటి వద్ద 63 కేవీ ట్రాన్స్​ఫార్మర్ ఏర్పాటు, 3 ఫేజ్​కనెక్షన్లు 9 మంజూరు చేయడానికి ఏఈ రూ.50 వేలు డిమాండ్​ చేశారు.

ఈ విషయాన్ని బాధితుడు టోల్​ఫ్రీ నంబర్​1064 ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు బుధవారం ఏఈకి రూ.10 వేలు లంచం ఇస్తుండగా రైడ్ చేసి, పట్టుకున్నారు. ఏఈని అరెస్ట్​చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.