జూ పార్కులో ఏనుగు మృతి

జూ పార్కులో ఏనుగు మృతి

తిరుపతి జూపార్కులో ఏనుగు మృతి చెందింది. అయితే ఈ ఏనుగు కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా యాదమరిలో ప్రజలపై దాడి చేసింది. పంట పొలాలను విధ్వంసం చేసింది. ఈ క్రమంలో పంట పొలాల్లో పరుగులు పెట్టిన ఏనుగుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న అధికారులు ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దానికి జూపార్క్ లో చికిత్స అందించారు. కానీ ఏమైందో ఏమో తెలియదుగాని.. తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి చెందింది. ఈ క్రమంలో మృతి చెందిన ఏనుగుకు అధికారులు ఈరోజు(నవంబర్ 08) పోస్టుమార్టం నిర్వహించనున్నారు.