స్పిన్ దిగ్గజానికి తుది వీడ్కోలు

స్పిన్ దిగ్గజానికి తుది వీడ్కోలు

ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ షేన్ వార్న్ కు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తుది వీడ్కోలు పలికారు. వార్న్ బర్త్ ప్లేస్ మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు, స్నేహితులు పాల్గొని నివాళులర్పించారు. వార్న్ ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మార్క్ టేలర్, ఆలన్ బోర్డర్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సహా 80 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనెల 4న థాయ్ లాండ్ లోని ఓ విల్లాలో 52 ఏళ్ల షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. లాస్ట్ వీక్ షేన్ వార్న్ డెడ్ బాడీ మెల్ బోర్న్ చేరుకుంది. ఈనెల 30న మెల్ బోర్న్ స్టేడియంలో వార్న్ సంస్మరణ కార్యక్రమం జరగనుంది. 1994లో ఇంగ్లాండ్ పై హ్యాట్రిక్, 2006 బాక్సింగ్  డే టెస్టులో 700వ వికెట్ సహా వార్న్ కెరీర్ లోని మైల్ స్టోన్స్ ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. మెల్ బోర్న్ స్టేడియంలోని సౌత్ స్టాండ్ కు వార్న్ పేరు పెట్టనున్నారు.

మరిన్ని వార్తల కోసం

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు

ఉక్రెయిన్​తో వార్ లో రష్యాకు ఎదురుదెబ్బలు