'ఎమర్జెన్సీ' అటల్ బిహారీ పాత్రలో ఎవరంటే....

'ఎమర్జెన్సీ' అటల్ బిహారీ పాత్రలో ఎవరంటే....

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ పాత్రను ఈ సినిమాలో కంగనా పోషిస్తోంది. కాగా తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. అటల్ బిహారీ వాజ్ పేయిగా నటుడు శ్రేయస్ తల్పడే ఈ మూవీలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దేశం పట్ల ప్రేమ, గర్వం ఉన్న నిజమైన జాతీయవాది అంటూ కంగనా పేర్కొంది. కాగా ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి జయలలిత వంటి బలమైన పాత్రలను పోషించిన కంగనా రనౌత్.. ఇప్పుడు మరోసారి మరో పవర్ ఫుల్ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గెటప్ లో అభిమానుల మదిని దోచుకోబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగా... జయప్రకాశ్ నారాయణ్ పాత్ర పోషిస్తున్న అనుపమ్ ఖేర్ ఇమేజ్ ను చిత్ర నిర్వాహకులు రీసెంట్ గా రిలీజ్ చేశారు. అంతే కాదు ఇటీవల విడుదలైన ఎమర్జెన్సీ టీజర్ కూడా విశేష స్పందనను సొంతం చేసుకుంది. దీంతో రోజు రోజుకూ ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.