కూలీలకు రూ.6 పెరిగిన ఉపాధి కూలి

కూలీలకు రూ.6 పెరిగిన ఉపాధి కూలి

ఉపాధి హామీ పథకం కింద కూలి పని చేసే కూలీలకు ఇకపై జీతం 6 రూపాయలు పెరుగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధి హామీ కింద పనిచేసే కూలీకు రూ.205 ఇస్తుండగా…అది రూ.211 కానుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రతిపాదనకు ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్పినా…ఎక్కడా ప్రచారం చేయకూడదని షరతు విధించింది. రాజకీయ నేతలు కూడా తమ ప్రచారంలో దీని గురించి ఎలాంటి ప్రకటన చేయకూడదని సూచించింది EC.