జయలలిత సేవలు అపూర్వం.. గుర్తు చేసుకున్న మోడీ

జయలలిత సేవలు అపూర్వం.. గుర్తు చేసుకున్న మోడీ

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత జయంతి సందర్భంగా ఆమె సేవలను ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. మహిళా సాధికారత కోసం జయ ఎంతో కృషి చేశారన్నారు. ప్రజా అనుకూల విధానాలతోపాటు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవ చిరస్మరణీయమని మోడీ ట్వీట్ చేశారు. 2016, డిసెంబర్ 16న జయలలిత తుదిశ్వాస విడిచారు. అమ్మగా, పురుచ్చి తలైవీగా జయను తమిళ ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారు. జయలలిత రికార్డు స్థాయిలో తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.