హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయొద్దని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు లేఖ రాశారు. ఆ ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాచలంతోపాటు తమ భూభాగంలో ముంపు తలెత్తకుండా ప్రాజెక్టు గేట్లతో పాటు రివర్ స్లూయిజ్లు తెరిచే ఉంచాలని లేఖలో డిమాండ్ చేశారు. నిరుడు పోలవరం గేట్లు మూసి ఉంచడంతో భద్రాచలం టౌన్తో పాటు తమ రాష్ట్రంలో 28 వేల ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం ఎంతమేర పడుతుందనే దానిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని 2016లోనే తాము విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తెలంగాణ, ఒడిశా, చత్తీస్గఢ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై స్టడీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు నిరుడు సెప్టెంబర్6న ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దీనిపై జలశక్తి శాఖ సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశం, టెక్నికల్ఆఫీసర్ల స్థాయిలో మూడు మీటింగ్లు, కేవలం తెలంగాణ, ఏపీ మధ్యనే రెండు కో ఆర్డినేషన్ మీటింగ్లు కూడా నిర్వహించారని తెలిపారు.
పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసినప్పుడు దుమ్ముగూడెం ఆనికట్వరకు బ్యాక్వాటర్ను స్టడీ చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్ సైతం సూచించారని తెలిపారు. సారపాక ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్ప్లాంట్, భద్రాచలం పట్టణంతో పాటు వాగులపై బ్యాక్వాటర్ఎఫెక్ట్పై జాయింట్సర్వే చేయాలని కూడా ఆదేశాలిచ్చారని తెలిపారు. నిర్దేశిత సమయంలోగా బ్యాక్ వాటర్ ప్రభావంపై స్టడీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో ముంపు వాటిల్లకుండా ఈ వానాకాలం మొత్తం.. పోలవరం 48 గేట్లు, రివర్స్లూయిజ్లు తెరిచే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.