కుల్గాంలో ఎన్కౌంటర్: ఒక టెర్రరిస్టు హతం

కుల్గాంలో ఎన్కౌంటర్: ఒక టెర్రరిస్టు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఇవ్వాళ ఉదయం కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు చనిపోయాడు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో కుల్గాంలోని ఒకాయ్ గ్రామంలో సైనికులు, కశ్మీర్ పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. ఉగ్రవాదులను భద్రతా దళాలు సమీపించగానే అటు వైపు నుంచి కాల్పులు జరిపారు. దీంతో అలర్ట్ అయిన సైనికులు ఎదురు కాల్పులకు దిగారు. రెండు వైపుల నుంచి హోరాహోరీ కాల్పుల అనంతరం ఒక టెర్రరిస్టు మరణించాడు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. అయితే అతడు ఏ గ్రూపునకు చెందిన ఉగ్రవాది అనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రెలైందట!

ఏపీ మంత్రి నానికి ఆర్జీవీ ప్రశ్నల వర్షం

కానిస్టేబుల్ విధులు కూడా సీపీనే చేశారు