విశాఖలో ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి

విశాఖలో ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టుల మృతి

విశాఖ పట్నం ఎజెన్సీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టు మృతి చెందారు.ఈ ఘటన విశాఖ పట్నంలోని మదిమల్ల గ్రామ సమీపంలో జరిగింది. మద్యాహ్నం ఒంటిగంటకు పోలీసులకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు చనిపోగా.. మరి కోందరు  పారిపోయారని విశాఖపట్నం ఎస్పీ బాబుజీ అట్టాడ తెలిపారు. గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం అక్కడ హైఅలర్ట్ ను ప్రకటించారు పోలీసులు. కొంతకాలంగా మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. పక్కా వ్యూహంతో దాడులు జరిపినట్టు తెలిసింది.