
హైదరాబాద్, వెలుగు: స్టీల్ డోర్ల తయారీలో పేరొందిన శక్తి హార్మన్ చెక్క తలుపుల తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం జైపూర్ (రాజస్థాన్) లో ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్, ఢిల్లీలో కలిపి రెండు ఎక్స్పీరియెన్స్ సెంటర్లను ఓపెన్ చేసింది. కస్టమర్లు ఈ సెంటర్లకు వెళ్లి ప్రొడక్ట్లను దగ్గరుండి పరిశీలించొచ్చు.
హైదరాబాద్లోని తయారీ ప్లాంట్లో స్టీల్ డోర్లు, రోలింగ్ షట్టర్లు, హైస్పీడ్ డోర్లను తయారు చేస్తోంది. ఏడాదికి 2 లక్షల కస్టమ్ మేడ్ డోర్లను, 10 వేలకు పైగా ఇండస్ట్రియల్ డోర్లను ఈ ప్లాంట్లో తయారు చేస్తున్నామని తెలిపింది. గతంలో శక్తి మెట్డోర్గా ఉన్న ఈ కంపెనీ 2012 లో జర్మనీ కంపెనీ హార్మన్తో టై అప్ అయ్యింది. ‘ జైపూర్లోని మహీంద్రా వరల్డ్ సిటీలో ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. దీని కెపాసిటీ ఏడాదికి 1,30,000 డోర్లు. రూ.175 కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం.
కమర్షియల్, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ సెగ్మెంట్లలో విస్తరించేందుకు, కొత్త టెక్నాలజీలతో డోర్లను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ కొత్త ప్లాంట్ వచ్చే ఏడాది జూన్ క్వార్టర్లోపు అందుబాటులోకి వస్తుంది’ అని శక్తి హార్మన్ ఎండీ శశిధర్ రెడ్డి అన్నారు.