హైదరాబాద్, వెలుగు: ప్రముఖ జువెల్లర్స్ ముసద్దిలాల్స్ జెమ్స్ అండ్ జువెల్లర్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోమవారం సోదాలు జరిపారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు సహా మొత్తం15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్, సికింద్రాబాద్లోని షో రూంలో రాత్రి 9 గంటల వరకు సోదాలు జరిగాయి. సెంట్రల్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేశారు.
పెద్దనోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్ జ్యువెలర్స్ భారీ అవకతవకలకు పాల్పడినట్లు గతంలోనే ఈడీ కేసు నమోదు చేసింది. నిరుడు ఫిబ్రవరిలో రూ.130 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి మరోసారి సోదాలు చేశారు. రాత్రి 9 గంటలదాకా తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. గోల్డ్ స్టాక్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై విచారించారు. సేల్స్ రికార్డ్స్లోని వివరాలు సేకరించారు. ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్లను పరిశీలించారు.