ముసద్దిలాల్​ జువెల్లర్స్‌‌లో ఈడీ సోదాలు

ముసద్దిలాల్​ జువెల్లర్స్‌‌లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రముఖ జువెల్లర్స్‌‌ ముసద్దిలాల్స్ జెమ్స్‌‌ అండ్‌‌ జువెల్లర్స్‌‌లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)  అధికారులు సోమవారం సోదాలు జరిపారు. హైదరాబాద్‌‌, విజయవాడ, గుంటూరు‌‌ సహా మొత్తం15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌‌ ఎర్రమంజిల్‌‌, సికింద్రాబాద్‌‌లోని షో రూంలో రాత్రి 9 గంటల వరకు సోదాలు జరిగాయి. సెంట్రల్‌‌ ఫోర్సెస్‌‌తో భద్రతా ఏర్పాట్లు చేశారు.

పెద్దనోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్​ జ్యువెలర్స్ భారీ అవకతవకలకు పాల్పడినట్లు  గతంలోనే ఈడీ కేసు నమోదు చేసింది. నిరుడు ఫిబ్రవరిలో రూ.130 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి మరోసారి సోదాలు చేశారు. రాత్రి 9 గంటలదాకా  తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. గోల్డ్‌‌ స్టాక్‌‌ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై విచారించారు. సేల్స్‌‌ రికార్డ్స్‌‌లోని వివరాలు సేకరించారు. ట్యాక్స్‌‌ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్‌‌లను పరిశీలించారు.