ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 260

ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 260

వన్డే సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 46 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 259 రన్స్ చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4, చాహల్ 3 వికెట్లతో సత్తా చాటారు. సిరాజ్ 2 వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో వన్డేలో భారత్‌ను 146 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి ప్రదర్శనే చెయ్యాలని ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. గౌరవప్రదమైన స్కోర్తో 2 టీమ్స్ కి గెలిచే అవకాశాలున్నాయి.