IND vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్..భారత జట్టులోకి కొత్త కుర్రాడు

IND vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్..భారత జట్టులోకి కొత్త కుర్రాడు

భారత్,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ నేడు (మార్చి 7) ప్రారంభమైంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పటిదార్, ఆకాష్ దీప్ స్థానాల్లో దేవదత్ పడికల్, బుమ్రా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. ఆలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులో చేరాడు.

భారత్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్