కామన్వెల్త్ గేమ్స్ సెమీస్లో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతీ మందాన 61 పరుగులతో చెలరేగింది. రోడ్రిగ్వేజ్ 31 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్మురేపింది. వీరితో పాటు దీప్తి శర్మ 22 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 20 రన్స్ తో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్ 2 వికెట్లు పడగొట్టగా..క్యాథరీన్ బ్రుట్, నాట్ సివర్ తలో ఓ వికెట్ దక్కించుకున్నారు.
Innings Break!
— BCCI Women (@BCCIWomen) August 6, 2022
61(32) from @mandhana_smriti & 44*(31) from @JemiRodrigues guide #TeamIndia to a total of 164/5 on the board.
Over to our bowlers now ?
Scorecard - https://t.co/ex8lGZQVs1 #INDvENG #B2022 pic.twitter.com/PWqc3alOdn