ఎంసెట్ ఎగ్జామ్.. ఒక్క క్షణం లేట్ అయినా నో ఎంట్రీ.. సమయానికి చేర్చే బాధ్యత తల్లిదండ్రులదే

ఎంసెట్ ఎగ్జామ్.. ఒక్క క్షణం లేట్ అయినా నో ఎంట్రీ.. సమయానికి చేర్చే బాధ్యత తల్లిదండ్రులదే

మొదటి సారి తెలంగాణలో ఎంసెట్ కు 3 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చాయని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. మే 10 నుంచి తెలంగాణలో జరగనున్న ఎంసెట్ పరీక్షల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.... రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 8 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశామని ఆయన చెప్పారు. , పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 137 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో 104, ఏపీలో 34 సెంట్లర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సారి ప్రతి సెంటర్లో సిట్టింగ్ అబ్జర్వర్స్ ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులు నిర్ణీత సమయంలోగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని లింబాద్రి సూచించారు. సమయానికి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాల్సిన బాధ్యత విద్యార్థులు తల్లిదండ్రుల మీద ఉందన్న ఆయన... ఒక్క క్షణం లేట్ అయినా పరీక్షా హాల్ లోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులు చూసుకోవాలని ఆదేశించారు. ఈ సారి ఎడ్ సెట్ ఒకే రోజు సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు యూనివర్శిటీ బిల్లు ప్రాసెస్ లో ఉందన్న లింబాద్రి.. అనుమతి వస్తేనే యూనివర్సిటీగా అది చెల్లుబాటు అవుతుందన్నారు. లేకపోతే అది కాలేజీగానే పరిగణించబడుతుందని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ ఉన్న రూట్లో ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కోరామని ఆయన స్పష్టం చేశారు.