రైతులకు మేలు చేసే బాధ్యత పాలక వర్గాలదే

రైతులకు మేలు చేసే బాధ్యత పాలక వర్గాలదే

వరంగల్: డీసీసీబీ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యావతి రాథోడ్, ఎమ్మెల్యేలు అరేరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మేయర్ గుండా ప్రకాష్ రావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ… రైతులకు మేలు చేసే బాధ్యత పాలక వర్గాలదని అన్నారు. రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా వరంగల్ డీసీసీబీ ని తీర్చిదిద్దాలని చెప్పారు. డీసీసీబీలు రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని…  కొత్త పాలక వర్గాల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. తాను కూడా డిసిసిబి చైర్మన్ గా పని చేశానని అన్నారు ఎర్రబెల్లి. ప్రభుత్వ గౌరవం, సంస్థల గౌరవం, మీ గౌరవం పెరిగే విధంగా పని చేయాలని కోత్త పాలక వర్గానికి ఆయన సూచించారు.

మంత్రి  సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… సీఎం  కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు మేలు జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం నుంచి రుణ మాఫీ కూడా ఇవ్వబోతున్నాట్లు చెప్పారు. రైతులు TRS పార్టీకి 100కి 94 శాతం ఓట్లేసి కేసీఆర్ పై ఉన్న నమ్మకాన్ని, తెలిపారని చెప్పారు. గతంలో కొంతమంది స్వార్థపరులు, బ్యాంకులు నిర్వీర్యం చేసి రైతులను ఇబ్బందికి గురి చేశారని ఆమె గుర్తుచేశారు. డీసీసీబీలు కొత్త సంస్కరణలు, పాలనతో రైతుల నమ్మకాన్ని పొందాలని చెప్పారు.