హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓయో రూమ్లో కలకలం రేపిన ఘటన ఇది..

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓయో రూమ్లో కలకలం రేపిన ఘటన ఇది..

గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని ఓయో రూమ్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగండ్లలో నివాసం ఉంటున్న జి.అనూష(26) బ్యూటీషియన్గా పని చేస్తోంది. ఎవరైనా ఆన్​లైన్​ద్వారా సంప్రదించినా వెళ్తుంటుంది. ఆమెకు ఏడాది క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా కొన్ని రోజులకే దంపతులు విడిపోయారు. తర్వాత అనూష తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నెల 22న సాయంత్రం 6 గంటలకు స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి, బయటకు వెళ్లింది. రాత్రి కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు.

మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు గచ్చిబౌలిలోని క్యూబిన్ ఓయో లాడ్జ్లో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లగా గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది.  ఆమె సూసైడ్​కు సంబంధించి కారణాలు తెలియలేదని  పోలీసులు పేర్కొన్నారు. అయితే అనూష ఆత్మహత్యపై మొదట సంతోష్ అనే వ్యక్తి తమకు సమాచారం అందించాడని, ఈ ఘటనపై అనుమానాలున్నాయని మృతురాలి సోదరుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.