అదానీ చేతికి ఎస్సార్​ పవర్​ ట్రాన్స్​మిషన్​ లైన్

అదానీ చేతికి ఎస్సార్​ పవర్​ ట్రాన్స్​మిషన్​ లైన్

న్యూఢిల్లీ: తనకున్న రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్​మిషన్​ లైన్స్​లో ఒక దానిని రూ. 1,913 కోట్లకు అదానీ ట్రాన్స్​మిషన్​కు అమ్మేస్తున్నట్లు ఎస్సార్​ పవర్​ లిమిటెడ్​ ప్రకటించింది. బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు గత మూడేళ్లలో రూ. 1.80 లక్షల కోట్లను ఎస్సార్​ ​ చెల్లించింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రాన్స్​మిషన్​ లైన్​ను అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. మూడు రాష్ట్రాలలో 465 కిలో మీటర్ల మేర ట్రాన్స్​మిషన్​ లైన్​ను  ఎస్సార్​ పవర్​ ఏర్పాటు చేసింది. ఒక్క ఎస్సార్​ పవర్​ కంపెనీనే తీసుకున్నా అప్పులను రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 6 వేల కోట్లకు తగ్గించుకుంది. రెన్యువబుల్​ ఎనర్జీపైనే ఫోకస్​ పెడుతున్నట్లు ఎస్సార్​ ఈ సందర్భంగా వెల్లడించింది.