న్యూఢిల్లీ: తనకున్న రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఒక దానిని రూ. 1,913 కోట్లకు అదానీ ట్రాన్స్మిషన్కు అమ్మేస్తున్నట్లు ఎస్సార్ పవర్ లిమిటెడ్ ప్రకటించింది. బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు గత మూడేళ్లలో రూ. 1.80 లక్షల కోట్లను ఎస్సార్ చెల్లించింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రాన్స్మిషన్ లైన్ను అమ్మాలనే నిర్ణయానికి వచ్చింది. మూడు రాష్ట్రాలలో 465 కిలో మీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్ను ఎస్సార్ పవర్ ఏర్పాటు చేసింది. ఒక్క ఎస్సార్ పవర్ కంపెనీనే తీసుకున్నా అప్పులను రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 6 వేల కోట్లకు తగ్గించుకుంది. రెన్యువబుల్ ఎనర్జీపైనే ఫోకస్ పెడుతున్నట్లు ఎస్సార్ ఈ సందర్భంగా వెల్లడించింది.