బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య (104) మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈటల కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్య.. ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.
మల్లయ్య అంత్యక్రియలు స్వగ్రామం కమలాపూర్ లో ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లుగా ఈటల కుటుంబీకులు తెలిపారు. మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం. ఇందులో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలున్నారు. రాజేందర్ మల్లయ్యకు రెండో కుమారుడు.