టీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్తూ ప్రమాదం.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

టీఆర్ఎస్ మీటింగ్ కు వెళ్తూ ప్రమాదం.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

హుజురాబాద్ ఎన్నికల సమయంలో TRS మీటింగ్ కు వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.  ఓ మహిళా ప్రమాదం జరిగిన రోజే చనిపోయినప్పటిికీ  మంత్రి హరీశ్ రావు జోక్యంతో మృతదేహానికి చికిత్స చేసినట్లు నటించి మరునాడు చనిపోయినట్లు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఈటల.. ప్రమాదంలో చనిపోయిన  మహిళ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. అప్పటి ప్రమాదంలో గాయపడి ఇవాళ చనిపోయిన మరో మహిళ రాజేశ్వరి కుటుంబానికి  నష్ట పరిహారం అందంచకుండా ఆలస్యం చేస్తున్నారని ప్రెస్ నోట్ లో ఆరోపించారు. వెంటనే ఈ రెండు కుటుంబాలతో పాటు.. గాయపడిన వారికి పరిహారం  ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు పెట్టి నాయకులకు వెల కట్టడానికి, ఓట్ల కోసం పంచిపెట్టడానికి  ముందుకు వచ్చిన చేతులు.. నిరుపేద మహిళలు చనిపోతే ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.