
హైదరాబాద్: విద్యార్థులకు చదువు ఉన్నా, ఉద్యోగం సంపాదించేందుకు అవసరమైన నైపుణ్యం ఉండటం లేదని, దేశంలోని అతి పెద్ద సమస్యల్లో ఇదీ ఒకటని ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ కాళీ ప్రసాద్ అన్నారు. నిజమైన చదువు అంటే నైపుణ్యాలను సంపాదించడమేనని స్పష్టం చేశారు. భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతకు నైపుణ్యాలను నేర్పించడం తప్పనిసరని అన్నారు. ‘‘దేశంలోని పట్టభద్రుల్లో 48శాతం మందికి ఉద్యోగ అర్హత లేదు. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం. ఏటా కోటి మందికి పైగా విద్యార్థులు డిగ్రీలు పొందుతున్నారు. కంపెనీలకు మాత్రం ఉద్యోగానికి సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.
ఏటా కోటి మంది డిగ్రీలు తీసుకుంటే.. పది లక్షల మందికి మాత్రమే మంచి జాబ్స్వస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి మేం తెలంగాణవ్యాప్తంగా స్టూడెంట్లకు నైపుణ్యాలను నేర్పించడానికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాలు క్లాస్రూమ్ విద్యకు ప్రాక్టికల్ అనుభవాన్ని చేర్చుతున్నాయి. వియత్నాం టెక్ హబ్గా ఎదుగుతోంది. అక్కడ విద్యా విధానం నేరుగా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంది. భారత్ వెంటనే ఈ పద్ధతులను అనుసరించాలి”అని ఆయన అభిప్రాయపడ్డారు.