ఈవీల అమ్మకాలు అదుర్స్.. జూన్ నెలలో 28.6శాతం అప్

ఈవీల అమ్మకాలు అదుర్స్.. జూన్ నెలలో 28.6శాతం అప్

ముంబై: మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్​ (ఈవీ) అమ్మకాలు జూన్ 2025లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి జూన్​లో 28.60 శాతం పెరిగి 1,80,238 యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) మంగళవారం (జులై 08) ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాల్లో భారీ పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణమని వెల్లడించింది. 

గత నెలలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాలు జూన్ 2024లో 7,323 యూనిట్లతో పోలిస్తే 13,178 యూనిట్లకు చేరుకున్నాయి. ఏడాది లెక్కన 79.95 శాతం పెరిగాయి. మొత్తం ఈవీ మార్కెట్‌‌లో ఈ–-ప్యాసింజర్ వెహికల్స్​ వాటా జూన్ 2024లో 2.5 శాతం నుంచి జూన్ 2025లో 4.4 శాతానికి పెరిగింది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విక్రయాలు 15.79 శాతం పెరిగి 60,559 యూనిట్లకు, ఎలక్ట్రిక్ టూ-వీలర్ విక్రయాలు 31.69 శాతం పెరిగి 1,05,355 యూనిట్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ కమర్షియల్​ వెహికల్స్​ అమ్మకాలు 122.5 శాతం వృద్ధితో 1,146 యూనిట్లకు చేరుకున్నాయి.