కేసులు పెట్టి  పనులు చేయడం దుర్మార్గం: డీకే అరుణ

కేసులు పెట్టి  పనులు చేయడం దుర్మార్గం: డీకే అరుణ

గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులను బెదిరించి పనులు కంప్లీట్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ హెచ్చరించారు.  గురువారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  పది ఏళ్లు గడిచినా రిజర్వాయర్ పనులు చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో ఎలాంటి సౌలతులు కల్పించకుండా ఊరిని ఖాళీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.  

ప్రస్తుత రేట్ల ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​  చేశారు. అదేవిధంగా  గద్వాల మండలం వీరాపురం గ్రామంలో, మల్దకల్ మండలం సద్దనోనిపల్లి విలేజ్ లో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరూర్ మండల కేంద్రంలో మన మట్టి మన భారత్ కార్యక్రమంలో పాల్గొని మట్టి సేకరణ చేశారు.  కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, భరద్వాజ్, రాజేష్ స్వామి, జగదీశ్వర్ రెడ్డి, పెద్ద కిష్టన్న, రామ్ రెడ్డి, రామన్న తదితరులు పాల్గొన్నారు.