సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్‌లో అందరూ పాల్గొనాలె : మురళీధర్ రావు

సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్‌లో అందరూ పాల్గొనాలె : మురళీధర్ రావు

సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని బీజేపీ నాయకులు మురళీధర్ రావు పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ లో ఈ నెల 10, 11, 12తేదీల్లో  జరగనున్న సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ 2023 లో భాగంగా  విక్రమాదిత్య నాటకోత్సవానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా  కథలలో, పాఠ్య పుస్తకాలలో వింటున్న విక్రమార్క చరిత్ర ను నాటక రూపంలో ప్రదర్శిస్తున్నామని మురళీధర్ రావు తెలిపారు.

మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఈ నాటక ప్రదర్శనకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ హాజరుకానున్నారు. విద్యా సంస్థలు, ఉద్యోగ సంస్థలు, గృహిణులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాంకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నాయకులు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.