అమరవీరుల స్తూపం ముందు..మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

అమరవీరుల స్తూపం ముందు..మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాకుండా మాజీ సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ బుధవారం సంగారెడ్డిలోని అమరవీరుల స్తూపం దగ్గర ఆయన చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్​ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

ప్రజలు బుద్ధి చెప్పినా అహంకారం వీడని బీఆర్ఎస్ కు భవిష్యత్​ మరింత అంధకారంగా మారుతుందని హెచ్చరించారు . కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోఆర్డినేటర్స్ మహేంద్ర, శశికాంత్, రామ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.