బీజేపీకి బాబూ మోహన్ రాజీనామా

బీజేపీకి  బాబూ మోహన్  రాజీనామా

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ బీజేపీకి  గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీలోని తాజా పరిస్థితులతో అసంతృప్తికి  గురైన ఆయన.. పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు.  రేపు తన రాజీనామ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి  పంపుతానని తెలిపారు.  

ALSO READ :- రైతులకు క్షమాపణ చెప్పాకే.. నల్గొండలో కేసీఆర్ అడుగుపెట్టాలి -విప్ బీర్ల అయిలయ్య

భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తాని బాబు మోహన్‌ వెల్లడించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన బాబు మోహన్ ఓడిపోయారు. కాగా  బాబూ మోహన్  తనయుడు ఉదయ్ ప్రస్తుతం బీఆర్ఎస్ లోఉన్నారు. ఈ క్రమంలో బాబూ మోహన్ కూడా అదే పార్టీలోకి మారుతారంటూ ప్రచారం నడుస్తోంది.