బీఆర్ఎస్​లోకి మాజీ ఎమ్మెల్సీ మోహన్​ రెడ్డి

బీఆర్ఎస్​లోకి మాజీ ఎమ్మెల్సీ మోహన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. గురువారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో మంత్రి కేటీఆర్​ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్​పార్టీయేనని, విద్యారంగం, టీచర్లకు సంబంధించిన అంశాలపై పని చేసేందుకే పార్టీలో చేరుతున్నట్లు మోహన్​రెడ్డి తెలిపారు.