
సీఎం కేసీఆర్ ను గద్దె దించగల్గే పార్టీలోనే చేరుతానన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గెలవరని.. గెలవనివ్వబోమని చెప్పారు. తనను , జూపల్లిని సస్పెండ్ చేయడం హస్యాస్పదమన్నారు.
కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యమన్నారు పొంగులేటి. జాతీయ పార్టీలు తనను సంప్రదిస్తున్నాయన్నది వాస్తవమని.. ప్రజాభిప్రాయం అనుగుణంగా భవిషత్త్ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలో చేరకముందు నుంచే తాను కాంట్రాక్టర్ అని పొంగులేటి చెప్పారు. ఎవరి వల్ల తాను లబ్ధి పొందలేదన్నారు.
వైసీపీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఏనాడు సుఖంగా లేనని పొంగులేటి చెప్పారు. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చాక స్వేచ్ఛా జీవులుగా ఉన్నామన్నారు. 2019లో సిట్టింగ్ ఎంపీగా ఉన్నా తనకు సీట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ నియంత ఆలోచనలతో కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని.. ఇంకా వందల సంఖ్యలో బీఆర్ఎస్ లో నేతలు మౌనంగా ఉన్నారని వెల్లడించారు. టైం వచ్చినప్పుడు బయటకు వచ్చి తనకన్నా ఘాటుగా స్పందిస్తారని వ్యాఖ్యానించారు. 2018లో టీడీపీ, కాంగ్రెస్ కూటమి వల్లే ఖమ్మంలో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.