నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామి

నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామి

మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ లో చేరారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు. పార్టీలో జాయిన్ అయ్యాక మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ కూల్చివేత పేరుతో వేలకోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. ఉద్యమసమయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. ఇక.. వివేక్ చేరికతో తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందన్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. పార్టీలో చేరడానికి ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు వివేక్.