ప్రైవేటు ట్రావెల్స్‌‌‌‌లో 30 కిలోల గంజాయి తరలింపు.. 8 మంది అరెస్ట్

ప్రైవేటు ట్రావెల్స్‌‌‌‌లో 30 కిలోల గంజాయి తరలింపు.. 8 మంది అరెస్ట్

ఎల్‌‌‌‌బీ నగర్, వెలుగు:  ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మందిని ఎక్సైజ్‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఏపీ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఢిల్లీ, మహరాష్ట్రకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయి సప్లై చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌ వద్ద ఓ ప్రైవేట్ బస్సులో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఏపీ, ఒడిశా, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌‌‌‌కు వస్తున్న ట్రావెల్స్ బస్సుల్లో హయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు.

ఇందులో రూ.7.50 లక్షల విలువ చేసే 30 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించి, సీజ్‌‌‌‌ చేశారు. సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరిండెంట్ టి.రవీందర్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంత్ రావు నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. ఏపీలోని విశాఖ జిల్లా, పలాస, రాజమండ్రి, నర్సీపట్నం, అరకు, ఒడిశాలోని మల్కన్ గిరి నుంచి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు తెలంగాణ ప్రాంతాలకు గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారని పోలీసులు తెలిపారు.