రూ. 2 కోట్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

రూ. 2 కోట్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

రెక్టిఫైడ్ స్పిరిట్ ను అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్ ఫ్యాక్టరీలపై దాడులు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ రైడ్ లో భారీగా రెక్టిఫైడ్ స్పిరిట్ ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లే హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలోని జగదాంబ కెమికల్స్ లో రెక్టిఫైడ్ స్పిరిట్ ను అక్రమంగా నిల్వ ఉంచారని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో తనిఖీ చేశారు. 

ఈ రైడ్ లో భారీగా కెమికల్స్ ను పట్టుకున్నారు. 105 డ్రమ్ము లలో నిల్వ ఉంచిన రూ. 2 కోట్ల 31లక్షల విలువ గల 21వేల లీటర్ల స్పిరిట్ ను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.