విశాఖపట్టణం: విశాఖపట్నం జిల్లా విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి భవన శిధిలాలు ఎగిరిపడ్డాయి. రెండు ద్విచక్ర వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. కంపెనీకి సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండటంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పింది. ఫైర్ సిబ్బంది సకాలంలో రంగంలోకి దిగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది.