బెర్లిన్: చమురు కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. కొనుగోళ్లు జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
భారత్ తన ప్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇంధన సమస్యల విషయానికొస్తే.. ప్రస్తుతం మార్కెట్ సంక్లి ష్టంగా ఉందని. భారత్లోని చమురు కంపెనీలు యూరప్తో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా పరిశీలిస్తాయని చెప్పారు.
