సికింద్రాబాద్,వెలుగు : ఈజీగా మనీ సంపాదించేందుకు డాక్టర్ గా అవతారమెత్తిన ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్కు చెందిన రాజు గంగారాం అంకలాప్(53) ఉపాధి కోసం సిటీకి వచ్చి రామంతాపూర్లో ఉంటున్నాడు. కొంతకాలం ఓ క్లీనిక్లో పనిచేయగా..ఆ సమయంలో ఆయుర్వేదం, జనరల్మెడిసిన్పై పరిజ్ఞానం సంపాదించాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అంబర్పేట్పటేల్ నగర్లో శ్రీసాయి వెంకటేశ్వర క్లీనిక్ను ప్రారంభించాడు.
అతనికి ఎలాంటి విద్యార్హతలు లేకపోగా.. డాక్టర్రాజు, డీఎన్వైఎస్, పీజీడీఈఎంఎస్ (ముంబై),ఫ్యామిలీ ఫిజీషియన్అని బోర్డుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన వారికి మందులు రాసి ఇస్తున్నాడు. నకిలీ డాక్టర్ గా అనుమానించి సమాచారం ఇవ్వగా టాస్క్ఫోర్స్ పోలీసులు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లులేవు. ఉన్నవి నకిలీగా తేలాయి. దీంతో క్లీనిక్లోని మెడిసిన్ , వైద్య పరికరాలు, రూ.1200 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజుపై కేసు నమోదుచేసి అంబర్పేట పోలీసులకు అప్పగించగా.. రిమాండ్కు తరలించారు.