
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా..భర్త ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.
అసలేం జరిగిందంటే.? సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన దంపతులు నవీన్ (౩౦) , రమ్య బార్య భర్తల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల కారణంగా భర్త పై కేసు పెట్టింద భార్య. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లతో జూన్ 28న మెదక్ జిల్లా కోర్టుకు వచ్చారు దంపతులు. అక్కడ ఇద్దరి మద్య వాగ్వాదం తలెత్తింది. దీంతో క్షణికావేశంలో కుటుంబం మొత్తం కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య రమ్య అక్కడిక్కడే మృతి చెందింది. . స్థానికుల సహాయంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త నవీన్, ఇద్దరు కూతుళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు కూడా చిన్న వయసు వాళ్లే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.