మెదక్ జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం

మెదక్ జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా..భర్త ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. 

అసలేం జరిగిందంటే.? సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ కు చెందిన దంపతులు నవీన్ (౩౦) , రమ్య  బార్య భర్తల మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ  గొడవల కారణంగా భర్త పై కేసు పెట్టింద భార్య. ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లతో జూన్ 28న మెదక్ జిల్లా కోర్టుకు వచ్చారు దంపతులు. అక్కడ  ఇద్దరి మద్య వాగ్వాదం తలెత్తింది. దీంతో  క్షణికావేశంలో కుటుంబం మొత్తం కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య రమ్య అక్కడిక్కడే మృతి చెందింది. .  స్థానికుల సహాయంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే   మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త నవీన్, ఇద్దరు కూతుళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కూతుళ్లు కూడా చిన్న వయసు వాళ్లే.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.