సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాలని దేశ ప్రజలను బలవంతం చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. సంతానంపై రూల్స్ పెడితే ప్రజలు నిరసన వ్యక్తం చేసే చాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేలా, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే రూల్ తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత, లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జనాభా కంట్రోల్పై పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేయాలని, కోర్టులు ఆ విధంగా ఆదేశాలివ్వలేవని చెప్పింది. ఢిల్లీ కోర్టు తీర్పుపై అశ్విని కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ చేసిన సుప్రీంకోర్టు బెంచ్ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.